News January 22, 2026

భద్రాద్రి జిల్లాలో 37 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

image

కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 9,278 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,407 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 550 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు వెల్లడించారు.

Similar News

News February 9, 2026

SAVE ‘RDT’

image

అనంతపురం జిల్లాలో పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం ఆర్డీటీకి FCRA పునరుద్ధరణ కాకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు జిల్లా ప్రజాప్రతినిధులు సమస్యను వివరించారు. అయినా అనుమతులు రాకపోవడంతో విద్య, వైద్య, క్రీడా రంగాల సేవలపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో లైసెన్స్ పునరుద్ధరణ కోరుతూ ప్రజా సంఘాలు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

News February 9, 2026

శ్రీశైలంలో నేడు బృంగివాహన సేవ

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు మల్లన్న బృంగివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.

News February 9, 2026

మార్కాపురం: లోయలో పడిన కారు.. ఒకరి మృతి

image

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.