News February 10, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

• తల్లితో గొడవపడి భద్రాచలం బాలిక ఆత్మహత్య• రైతు భరోసాకు ఎగనామం పెట్టారు: CPIML• పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే జారే • పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిలో ముగిసిన పూజలు • సేవాలాల్ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ • ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు: అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్• బూర్గంపాడులో యథేచ్ఛగా ఇసుక రవాణా • గుండాలలో యువకుడి మృతి
Similar News
News September 15, 2025
త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: మంత్రి అనగాని

AP: భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News September 15, 2025
KNR: వారికోసం రూ.8వేల కోట్లు చెల్లించలేదా?: బండి

ఫీజు రీయంబర్స్మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని చంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షల విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ సుందరీకరణ, 4th సిటీ, మిస్ వరల్డ్ పోటీలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి లక్షల విద్యార్థుల భవిష్యత్తు కన్పించట్లేదా? వారికోసం రూ.8వేల కోట్లను చెల్లించలేదా? అని ప్రశ్నించారు.
News September 15, 2025
కేసులు పెట్టినా వెనక్కి తగ్గం: మత్స్యకారులు

బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. మమ్మల్ని ఉరితీసి చంపడంటూ మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. కేసులు పెట్టినా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.