News March 19, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పోడు రైతులకు జిల్లా కలెక్టర్ శుభవార్త ✓ గోదావరి ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పాయం ✓ అసెంబ్లీలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పట్ల జిల్లా వ్యాప్తంగా సంబరాలు ✓ సైబర్ నేరాలపై టేకులపల్లిలో అవగాహన ✓ అశ్వారావుపేటలో కబేళాకు తరలిస్తున్న మూగజీవాలు పట్టివేత ✓ అశ్వాపురం అడవుల్లో ఆగని మంటలు ✓ ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం: మాల మహానాడు ✓సీఎంతో భేటీ అయిన గుమ్మడి నరసయ్య.
Similar News
News February 23, 2026
కర్ణాటక హైకోర్టుకు రణ్వీర్ సింగ్

తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్జెంట్ హియరింగ్ చేపట్టాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని.. పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి విచారణ వేగవంతం చేయాలా? అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కాంతారలో దైవాన్ని కించపరిచారంటూ <<18988013>>రణ్వీర్పై<<>> కేసు నమోదైంది.
News February 23, 2026
ASF: డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆత్రం సుగుణ

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణ శిబిరం మూడో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై మార్గదర్శనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠిక ప్రతిని మంత్రి భట్టికి అందజేశారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చించారు.
News February 23, 2026
NGKL: పోలీస్ ప్రజావాణికి 5 దరఖాస్తులు

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 5 దరఖాస్తులు వచ్చాయి. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సూచనలు చేశారు. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యతని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


