News March 31, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
✓ గిరిజన దర్బార్ రద్దు
✓ ఘనంగా చిలకలగండి ముత్యాలమ్మ జాతర
✓ ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
✓ దుమ్ముగూడెంలో ఇసుక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
✓ భద్రాచలం బిల్డింగ్ కూలిన ఘటనలో వ్యక్తి అరెస్ట్
✓ గుడుంబా స్థావరాలపై కరకగూడెం పోలీసుల దాడులు
✓ పేరాయిగూడెంలో 5 గుడిసెలు దగ్ధం
✓ భార్య పుట్టింటికి వెళ్లిందని.. మణుగూరులో భర్త ఆత్మహత్య
Similar News
News April 14, 2026
నంద్యాల: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రకు ఏడుగురు విద్యార్థులు

ప్రత్యేక ప్రతిభావంతుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను మంగళవారం ఉండవల్లిలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 మంది విద్యార్థుల బృందంలో నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు ఏడుగురు ఉండడం విశేషం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాల ప్రోత్సహిస్తామన్నారు.
News April 14, 2026
ఐపీఎల్: SRHలోకి కొత్త ప్లేయర్

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో ఫాస్ట్ బౌలర్ వచ్చారు. గాయంతో టోర్నీకి దూరమైన బ్రైడన్ కార్స్(ENG) స్థానంలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ అఫీషియల్గా ప్రకటించింది. రూ.75లక్షల ప్రైస్తో ఆయన్ను తీసుకుంది. మధుశంక గతంలో ముంబై ఇండియన్స్కు ఆడారు. SL తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20ల్లో మొత్తం 70 వికెట్లు పడగొట్టారు.
News April 14, 2026
కామారెడ్డి: ట్రాఫిక్ నిబంధనలతోనే భద్రత: ఎస్పీ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు KMR ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఏప్రిల్ 18 వరకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నియమాలను పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


