News February 20, 2025

భద్రాద్రి జిల్లా TOP NEWS

image

✓భద్రాచలం సరిహద్దు గ్రామాల్లో పోలీసుల ముమ్మర తనిఖీ✓ భద్రాచలంలో చైన్ స్నాచింగ్ ✓ సేవాలాల్ జయంతి వేడుకల్లో స్టెప్పులేసిన జిల్లా కలెక్టర్ ✓ మణుగూరులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ✓ సంపన్నుల కోసమే కేంద్ర బడ్జెట్: సీపీఎం✓ జాతరలో ఎమ్మెల్యే కోరం కనకయ్య డాన్స్ ✓ భద్రాచలంలో ఎండు గంజాయి పట్టుకున్న పోలీసులు ✓ అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు: భద్రాద్రి ఎస్పీ

Similar News

News July 6, 2025

రాజాపూర్: గొంతులో పూరి ఇరుక్కుని యువకుడి మృతి

image

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన బ్యాగరి కిరణ్ కుమార్ (25) వ్యవసాయ పొలంలో పూరీలు తింటుండగా గొంతులో ఇరుక్కొనడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News July 6, 2025

వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

image

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.

News July 6, 2025

నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

image

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.