News January 26, 2025

భద్రాద్రి ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు: ఎస్పీ రోహిత్

image

76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వెనక ఎంతో మంది పోరాటయోధుల త్యాగం దాగి ఉందని గుర్తు చేశారు.

Similar News

News July 9, 2025

ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

image

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

News July 9, 2025

నాగార్జునసాగర్ నిండితే వారికి పండుగే..

image

నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఎమోషన్. ఇది నిండిందంటే చాలు వారికి పండుగే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్‌లో‌కి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 3.75 లక్షల ఎకరాలు ఉంది.

News July 9, 2025

సిగాచీ.. ఆ 8 మంది మృతిచెందారని అనుమానాలు

image

TG: సిగాచీ ప్రమాద ఘటనలో ఆచూకీ దొరకని 8 మంది మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించడం కష్టమేనని తెలిపారు. రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కాలి బూడిదై ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఈ ఘటనలో అంతకుముందు 44 మంది మరణించారు.