News October 8, 2025
భద్రాద్రి: మండలాలకు చేరిన బ్యాలెట్ బాక్సులు

స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాలకు తరలించారు. బుధవారం రోజున జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ గోడౌన్ నుంచి ఈ బాక్సులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 8, 2025
మాకవరపాలెం: జగన్ పర్యటన.. భద్రతపై ఎస్పీ సమీక్ష

మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంతాన్ని ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు. రేపు జరగనున్న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంభందించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడే ప్రదేశంతో పాటు కళశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
News October 8, 2025
అనకాపల్లి: ‘PGRS అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయాలి’

మండల, డివిజన్ స్థాయిలో పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వచ్చిన ప్రతి అర్జీకి రసీదు ఇవ్వాలన్నారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల స్థాయి సమన్వయ కమిటీ ద్వారా సివిల్ తగాదాలను పరిష్కరించాలని సూచించారు. నీటితీరువా, కోర్టు కేసులు, స్మార్ట్ కార్డుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు.
News October 8, 2025
విజయవాడ: RTC పైసా వసూల్..!

దసరా సందర్భంగా విజయవాడ PNBSకు SEP 24 నుంచి OCT 6వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.20.20 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 40 లక్షల మంది పండుగ రోజుల్లో రవాణా చేశారు. PNBS పరిధిలో మొత్తం 750 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక గత ఏడాది కేవలం 20 లక్షల మందే ట్రావెల్ చేయగా.. రూ.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఉచిత బస్సు పథకం వల్ల 50% ప్రయాణికులు సంఖ్య, 25% ఆదాయం పెరిగిందని RTC అధికారులు చెబుతున్నారు.