News August 14, 2025

భద్రాద్రి: మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు

image

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ స్థాయిలో పనిచేసిన ఆరుగురు దళ కమిటీ సభ్యులు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలో భాగంగా వారు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.

Similar News

News August 14, 2025

HYDలో 58 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి: కలెక్టర్

image

భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్నట్లు HYD కలెక్టర్ హరిచందన తెలిపారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, హైదరాబాద్ జిల్లాలో 58 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఆఫీసుల్లో నుంచి ఉద్యోగులు ఒకేసారి బయటకు వచ్చి ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడొద్దని సూచించారు.

News August 14, 2025

నిర్మల్: వలకు చిక్కిన ‘బొచ్చె’డంత ‘చేప’!

image

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన దూసం సాయినాథ్ అనే మత్స్యకారుడికి అరుదైన చేప లభ్యమైంది. గురువారం పోచంపాడు డ్యాంలో అతడు చేపల వేటకు వెళ్లగా సుమారు 25 కిలోల భారీ బొచ్చె చేప వలకు చిక్కింది. కుబీర్ వారసంతకు ఆ చేపను అమ్మకానికి తీసుకురావడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఇలాంటి రకమైన చేపలు అరుదుగా దొరుకుతాయని సాయినాథ్ తెలిపాడు. ఇప్పటివరకు మీరు చూసిన అతి భారీ చేప ఏది? ఎన్ని కిలోలు? ఎంత ధర పలికింది?

News August 14, 2025

అత్యవసరం ఉంటే తప్ప బయటకి రావద్దు: జిల్లా కలెక్టర్

image

భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రజలను కోరారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.