News November 11, 2025
భద్రాద్రి రామయ్యతో అందెశ్రీకి ప్రత్యేక అనుబంధం

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. కొత్తగూడెంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాలోత్సవ్కు పలుమార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం, పాడిన పాటలను స్మరించుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసరాల్లో ఏప్రాంతానికి వచ్చిన గోదావరిలో స్నానం చేసి రామయ్యను దర్శనం చేసుకునేవారని గుర్తు చేసున్నారు.
Similar News
News November 11, 2025
జడ్చర్ల: దొంగ నోట్లను గుర్తించండిలా..!

జడ్చర్లలో దొంగనోట్ల చలామణి కేసులో నలుగురిని అరెస్టు చేయడంతో మార్కెట్లో నకిలీ నోట్లపై అప్రమత్తత ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు నోటును గుర్తించేందుకు గాంధీ చిత్రం, వాటర్మార్క్, భద్రతా దారం, ఆప్టికల్ వేరియబుల్ ఇంక్లను పరిశీలించాలి. నకిలీ నోట్లలో ఇవి మసకబారి, నాణ్యత లేకుండా ఉంటాయి. అనుమానం వస్తే వెంటనే బ్యాంకులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.
News November 11, 2025
శబరిమలకు అద్దె బస్సులు

TG: రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని RTC నిర్ణయించింది. ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాషన్ డిపాజిట్ రూ.10వేలు చెల్లించాలి. తిరిగొచ్చాక ఆ డబ్బు వెనక్కిస్తారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాల్సి ఉంటుంది.
News November 11, 2025
కొవిడ్ లాక్డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.


