News December 15, 2025
భద్రాద్రి: వాగులు, వంకలు దాటొచ్చి.. ప్రజాస్వామ్యాన్ని చాటి!

అశ్వారావుపేట(M) రేగళ్లగుంపునకు చెందిన గొత్తికోయలు ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను చాటుకున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ 97 మంది ఓటర్లు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి కారడవి మార్గంలో ప్రయాణించారు. వారు రాళ్లూరప్పల దారుల్లో, వాగులు, వంకలు దాటుతూ 8 KM దూరం కాలినడకన వెళ్లి బచ్చువారిగూడెం పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News December 17, 2025
నారాయణపేట: తుది దశలో మొదటి విజయం

ఊట్కూరు మండల పరిధిలోని సమిస్తాపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. గ్రామంలో మొత్తం 440 ఓట్లు ఉండగా 382 ఓట్లు పోలయ్యాయి. నలుగురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీలో రింగు గుర్తుకు 48, కత్తెర గుర్తుకు 176, బ్యాట్ గుర్తుకు 30, ఫుట్బాల్ గుర్తుకు 127 ఓట్లు వచ్చాయి. ఇందులో కత్తెర గుర్తుతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి సర్పంచ్గా గెలుపొందారు.
News December 17, 2025
గొల్లభామ తండా సర్పంచ్గా బాలు నాయక్

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.


