News March 6, 2026
భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం టికెట్ కౌంటర్లు ఎక్కడంటే.!

ఈనెల 27, 28 తేదీలలో భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు సెక్టార్ల వారీగా టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించినట్లు ఆలయ ఈవో ప్రకటనలో వెల్లడించారు. ఆఫ్లైన్ టికెట్ల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు: 1.ఆలయము వద్ద మెయిన్ టిక్కెట్ కౌంటర్, 2.తానీషా కళ్యాణ మండపం CRO, 3.బ్రిడ్జి పాయింట్ CRO, 4. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.
Similar News
News April 5, 2026
సింగిపురం: 113కి చేరిన కల్తీ బాదంపాల బాధితుల సంఖ్య

శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం జాతరలో కల్తీ బాధంపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో శుక్రవారం సుమారు 80 మంది పీహెచ్సీలో చేరగా.. శనివారంనాటికి కేసులు 113కు పెరిగాయి. ప్రస్తుతం బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
News April 5, 2026
KMR: జిల్లాలో చికెన్, మటన్ ధరలు

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.280-రూ.290 విక్రయిస్తుండగా లైవ్ కోడి రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
News April 5, 2026
IPL: ఇప్పటి వరకు వీళ్లే టాప్!

IPL-19లో ఇప్పటి వరకు 9మ్యాచులు జరగ్గా పలువురు యంగ్ క్రికెటర్లు సత్తా చాటారు. DC ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆడిన 2 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో 160పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో రోహిత్(113), కూపర్(108), రఘువంశీ(103) ఉన్నారు. ఇక రవి బిష్ణోయ్(RR) 5 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నారు. వైశాఖ్ విజయ్ కుమార్ సైతం 5 వికెట్లు పడగొట్టినా ఎకానమీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు.


