News February 26, 2026
భద్రాద్రి: సాకారం కానున్న ఏజెన్సీ క్రీడాకారుల కల

భద్రాచలం ఏజెన్సీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుంది. భద్రాచలంలో గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు ఏర్పాటు చేస్తూ ఐదు ఎకరాల భూమిని సైతం కేటాయిస్తూ క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రమే మైదానం ఉండడంతో అన్ని కార్యక్రమాలు అక్కడే నిర్వహిస్తుండగా గ్రీన్ ఫీల్డ్ హామీ కే పరిమితం కాకుండా భూసేకరణ, నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
Similar News
News February 27, 2026
HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.
News February 27, 2026
చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటికొచ్చా: కవిత

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్చిట్ లభించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే మోపారని తాను తెలంగాణ ప్రజలకు మొదటి నుంచీ చెప్తూ వస్తున్నట్లు తెలిపారు. ‘కడిగిన ముత్యంలా వస్తానని ముందే చెప్పాను. అదే జరిగింది. కష్టసమయంలో అండగా నిలబడ్డ జాగృతి కార్యకర్తలు, భర్త, అత్తామామలు, కొడుకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.
News February 27, 2026
HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.


