News March 29, 2025
భరత్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మహిళ హత్య కేసును ఛేదించారు

ఈనెల 26న జరిగిన భరత్ నగర్ ఫ్లైఓవర్ కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జనగామ చెందిన కనకరాజు అనే వ్యక్తి ఆ మహిళతో శారీరకంగా కలిసిన తర్వాత కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. హత్య చేసిన వ్యక్తి పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.
Similar News
News March 31, 2025
నెల్లూరు : ఈ రోజు రాత్రి 12 గంటల వరకే..

ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత యథావిధిగా రబీ సీజన్కు సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ బడుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేసి ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని సూచించారు.
News March 31, 2025
జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ కానున్న పవన్కళ్యాణ్

సీతమ్మధార జనసేన కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. క్యాంపు రాజకీయల సంస్కృతి పార్టీలో ఉండకూడదన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని వెల్లడించారు. త్వరలో అమరావతిలో 11 మంది జనసేన కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుందని ఆయన తెలిపారు.
News March 31, 2025
ధోనీ మ్యాచ్ విన్నర్ కాదు.. ఈ గణాంకాలే నిదర్శనం: విశ్లేషకులు

క్రికెట్లో ధోనీ బెస్ట్ ఫినిషర్. అతను చివరి వరకు క్రీజులో ఉంటే గెలుపు ఖాయమనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. అతని IPL గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2023 నుంచి ఇప్పటి వరకు ఛేజింగ్ చేస్తూ జట్టు గెలిచిన సందర్భాల్లో అతను 3 మ్యాచ్లలో 3 రన్స్(9 బాల్స్) మాత్రమే చేశారు. ఓడిన గేమ్స్లో 6 Innsలలో 166 రన్స్(84 బంతులు) చేశారు. దీన్నిబట్టి టీమ్ విజయాల్లో ధోనీ పాత్ర ఏమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీరేమంటారు?