News March 29, 2025
భర్త చేతిలో భార్య దారుణ హత్య

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనీపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News March 31, 2025
NGKL: తెలకపల్లిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా తెలకపల్లి, పెద్దకొత్తపల్లిలో 40.1 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పెద్దూర్ 40.0, పెంట్లవెల్లి, కొల్లాపూర్ 39.9, కల్వకుర్తి, వంగూర్ 39.8, చారకొండ, ఉప్పునుంతల 39.7, వెల్దండ, అచ్చంపేట 39.6, నాగర్ కర్నూల్ 38.9, అమ్రాబాద్ 38.8, తాడూర్ 38.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News March 31, 2025
అరుణాచల్ ప్రదేశ్లో స్వల్ప భూకంపం

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు అరుణాచల్ ప్రదేశ్లోని షియోమీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇటీవల మయన్మార్, థాయ్లాండ్ సహా భారత్లోని మేఘాలయ, కోల్కతా, ఢిల్లీలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
News March 31, 2025
మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

PM మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా IFS అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్(UP)కు చెందిన ఈమె తొలుత వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో PMOలో అండర్ సెకట్రరీగా చేరి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్ పొందారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న నైపుణ్యంతో ఆమె ఇప్పుడు 35 ఏళ్లకే PMOలో కీలక స్థాయికి వచ్చారు.