News December 21, 2025
భవన శిథిలాలు రోడ్లు పక్కన పోస్తే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 13, 2026
గంగవరం పోర్టులో కనీసం బ్రేక్ వాటర్ నిర్మించండి: ఎమ్మెల్యే పల్లా

గంగవరం పోర్టు ఏర్పడిన తర్వాత ఇక్కడ జెట్టీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జెట్టీ లేక ఇక్కడి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. కనీసం బ్రేక్ వాటర్ను అయినా నిర్మించి స్థానిక మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.
News February 13, 2026
విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.
News February 13, 2026
విశాఖలో అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలు.. పటిష్ఠ భద్రత

ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల కోసం విశాఖలో 7,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాష్ట్రపతి, 75 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ మహా వేడుక కోసం 64 డ్రోన్లు, ఆధునిక యాప్లతో నిఘా పెంచారు. తీర భద్రతను కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని 112 తెలియజేయాలని కోరారు.


