News December 19, 2024

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌కు టెక్ తోడు: క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ

image

టెక్ తోడుగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఈ యాప్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర బాబుతో క‌లిసి యాప్‌ను ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు మ‌రింత సౌక‌ర్యంగా ఉండేలా చేయాల్సిన మార్పుల‌పై క‌లెక్ట‌ర్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. 

Similar News

News January 25, 2026

అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాలో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిభ కనబర్చారు.

News January 25, 2026

కృష్ణా: పద్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి నేపథ్యం ఇదే..!

image

కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వెంపటి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1950 ఆగస్ట్ 12న గుడ్లవల్లేరులో ఆయన జన్మించారు. అద్వైత-వేదాంత, దర్శనాలు, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్యంలో సంస్కృత పండితులు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు.

News January 25, 2026

కృష్ణా: డా. నోరి దత్తాత్రేయుడి నేపథ్యమిదే

image

వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డా. నోరి దత్తాత్రేయకు కేంద్రం పద్మ భూషన్ అవార్డు ప్రకటించింది. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన డా. నోరి 1947లో జన్మించారు. మచిలీపట్నంలో పాఠశాల విద్య, కర్నూలులో వైద్య విద్యనభ్యసించారు. ప్రపంచంలోనే క్యాన్సర్ వ్యాధి నిపుణుడిగా ఆయన పేరుగాంచారు. 2015లోనూ డా.నోరి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.