News December 24, 2025

భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా “స్మార్ట్ కిచెన్” నిర్మించాలి: కలెక్టర్ శ్రీధర్

image

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్ నిర్మాణం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. మంగళవారం చెన్నూరు మండలం కొండపేటలో రూ.38 లక్షలతో నిర్మిస్తున్న డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్‌ను పరిశీలించారు. ఈ కేంద్రం నుంచి 41 పాఠశాలలకు భోజనం సరఫరా అవుతుందని ఆయన తెలిపారు.

Similar News

News December 25, 2025

మైదుకూరులో గుండెపోటుతో యువ వైద్యుడు మృతి

image

మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డుకు చెందిన యువ వైద్యుడు శశికాంత్ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన మృతి చెందడం పట్ల మైదుకూరు పట్టణ వాసులు, పరిసర ప్రజలు విచారం వ్యక్తం చేశారు. కాగా ఈయన తండ్రి డాక్టర్ రంగ సింహ ఇటీవలే వయో భారం కారణంగా మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు వైద్యులు మృతి చెందడంతో పట్టణవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈయన ఉన్నత వైద్య విద్యను అభ్యసించారు.

News December 25, 2025

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 25, 2025

జగన్‌కు ముద్దు పెట్టిన విజయమ్మ

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.