News October 31, 2025
భాగస్వామ్య సదస్సు విజయవంతంపై కలెక్టర్ సమీక్ష

విశాఖలో ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. AU ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే ఈ సదస్సును అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని విజయవంతం చేయాలని ఆదేశించారు. నగర సుందరీకరణ, అతిథుల వసతి, భద్రత, రాకపోకలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News October 31, 2025
విశాఖ: పట్టణ ప్రణాళిక అధికారులులతో మేయర్ సమీక్ష

GVMC పరిధిలో ఎన్ని ప్రకటనల హోర్డింగు బోర్డులు ఉన్నాయి వాటి పూర్తి వివరాలను నివేదించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు GVMC పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం GVMC కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్రకటన హోర్డింగుల ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్కు ప్రకటన బోర్డులను ప్రదర్శించడానికి వాటికి ఎంత వసూలు చేస్తున్నారో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News October 31, 2025
UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.
News October 31, 2025
విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ల భర్తీ

ఆర్టీసీలో పదోన్నతుల కారణంగా డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఐటీఐ చేసి 18 నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో అన్కాల్ డ్రైవర్గా తీసుకోవడం జరుగుతుందని, దగ్గర్లో ఉన్న డిపోల్లో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.


