News February 8, 2025

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలికంగా రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొడ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 31, 2025

కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్

image

AUS మాజీ క్రికెటర్ డామీన్ మార్టిన్ (54) కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రకటించారు. DEC 26న అనారోగ్యంతో బ్రిస్బేన్‌లోని ఆస్పత్రిలో చేరగా.. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. మార్టిన్ Meningitis అనే వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇది మెదడువాపుకు కారణం అవుతుందన్నారు. మార్టిన్ 208 వన్డేల్లో 5,346, 67 టెస్టుల్లో 4,406 రన్స్ చేశారు. 2003 WC ఫైనల్లో వేలు విరిగినా INDపై 88 పరుగులు చేశారు.

News December 31, 2025

ఎవరి జోక్యమూ లేదు.. చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

image

భారత్-పాక్ మధ్య <<18718800>>మధ్యవర్తిత్వం<<>> చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం రెండు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని పలు వివాదాలను పరిష్కరించామన్న చైనా విదేశాంగ మంత్రి.. భారత్-పాక్ ఉద్రిక్తతలనూ తగ్గించామని చెప్పటంతో భారత్ స్పందించింది.

News December 31, 2025

మేడారం భక్తుల కోసం గట్టమ్మ వద్ద 10 ఎకరాల పార్కింగ్

image

మేడారం మహా జాతర దృష్ట్యా భక్తుల వాహనాల పార్కింగ్ కోసం గట్టమ్మ పరిసరాల్లో 10 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. బుధవారం SP సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ కలిసి ఈ ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అటవీశాఖ ఈ స్థలాన్ని సమకూర్చడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ స్థలం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.