News December 18, 2025
భారత్కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం

ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన ఫైనల్ పోటీల్లో కర్ణాటకకు చెందిన విద్యా సంపత్ మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా నిలిచారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి భారత్కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందిచారు విద్య.
Similar News
News December 20, 2025
స్పైస్జెట్ ప్యాసింజర్పై ఎయిర్ ఇండియా పైలట్ దాడి!

ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (AIX) పైలట్ ఒకరు తనపై దాడి చేశారని స్పైస్జెట్ ప్యాసింజర్ అంకిత్ దేవాన్ ఆరోపించారు. క్యూ లైన్ దాటుకొని వెళ్లడాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహించిన పైలట్ తన ముఖంపై రక్తం వచ్చేలా కొట్టాడని Xలో పోస్ట్ చేశాడు. గాయాలకు సంబంధించిన ఫొటోను కూడా జత చేశాడు. ఘటన సమయంలో పైలట్ విధుల్లో లేనప్పటికీ.. అతణ్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు AIX తెలిపింది.
News December 20, 2025
మలయాళ నటుడు శ్రీనివాసన్ మృతి

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు, స్క్రీన్ప్లే రైటర్ శ్రీనివాసన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించిన శ్రీనివాసన్ 48 ఏళ్ల సినీ కెరీర్లో కామెడీ పాత్రలతో అలరించారు. సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.
News December 20, 2025
IRCTC వాలెట్తో బోలెడు ప్రయోజనాలు

IRCTC E-వాలెట్లో జమ చేసిన డబ్బులను నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనివలన ప్రయాణికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తత్కాల్ టికెట్లు కేవలం సెకన్లలోనే బుక్ అవుతాయి. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా, బుకింగ్ కాకపోయినా రిఫండ్ డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. అదే సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే రోజుల తరబడి వేచి చూడాలి.


