News January 6, 2026
భారత్లో పర్యటించనున్న జర్మనీ ఛాన్స్లర్

జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తొలిసారి భారత పర్యటనకు రానున్నారు. PM మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో అహ్మదాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. 12వ తేదీ ఆయనకు PM మోదీ స్వాగతం పలకనున్నారు. జర్మనీ-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి గతేడాదితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
Similar News
News February 18, 2026
ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత

AP: విశాఖ AUలో ఉద్రిక్తత నెలకొంది. SFIకి వ్యతిరేకంగా ABVP కార్యకర్తలు నినాదాలు చేస్తూ VC ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే టైమ్లో SFI నేతలు అక్కడికి వచ్చి ప్రతినినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్లోకి బయటి వ్యక్తులు రాకుండా మెయిన్ గేటుకు తాళాలు వేశారు. AUలో నిన్న RSS మార్చ్ను SFI అడ్డుకున్న నేపథ్యంలో వివాదం ఏర్పడింది.
News February 18, 2026
క్లీనింగ్ టిప్స్ మీ కోసం..

* ముత్యాల నగలు మురికిగా అయితే ఆలివ్ నూనెలో ముంచిన దూదితో తుడవండి.
* బట్టలపై నూనె పడితే ఉప్పు అద్దిన నిమ్మకాయతో రుద్దండి.
* షవర్ రంధ్రాలు మూసుకుపోతే, వైట్ వెనిగర్తో శుభ్రం చేసుకోవచ్చు.
* ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
* బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో కీరదోసను ముక్కలుగా కోసి పెడితే, వాటి బెడద తగ్గుతుంది.
News February 18, 2026
నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. లోకేశ్ సెటైర్

AP: కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు భారీగా ప్రజాధనం ఖర్చు చేశారనే ప్రచారంపై మంత్రి లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?’ అంటూ పుష్ప స్టైల్లో సెటైర్ వేశారు. కాగా లోకేశ్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.


