News December 24, 2025

భారత్ అండర్-19 జట్టుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

image

అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెప్పారు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమ్‌ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాలిటిక్స్, స్పోర్ట్స్‌ను వేరుగా చూడాలి. భారత ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో అండర్-19 ఆసియా కప్‌ను పాక్ గెలుచుకుంది.

Similar News

News December 25, 2025

ప్రెగ్నెన్సీలో కింద కూర్చొంటున్నారా?

image

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులను గమనించుకుని తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవాలి అనుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.

News December 25, 2025

శివుడిగా పూజలందుకున్న తిరుమల శ్రీవారు

image

తిరుమల శ్రీవారు ఒకప్పుడు శివుడిగా పూజలందుకున్నారని చాలామందికి తెలిసుండదు. మూలవిరాట్టుకు ఉన్న జటలు, నాగభూషణాలు చూసి భక్తులు ఆయనను ఈశ్వరుడిగా భావించేవారు. రామానుజాచార్యులు నిర్వహించిన పరీక్షలో శ్రీవారు శంఖుచక్రాలు ధరించి అది వైష్ణవ రూపమని నిరూపించారు. తిరుమల ఆలయానికి రుద్రుడు క్షేత్రపాలుడిగా ఉండటం హరిహర అద్వైతానికి, శైవ వైష్ణవ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News December 25, 2025

నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

image

AP: మాజీ PM వాజ్‌ పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన యాత్రను రాజధాని అమరావతిలో ముగించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని అటల్ స్మృతివనంలో 11amకు అటల్ కాంస్య విగ్రహాన్ని CM CBN ఆవిష్కరిస్తారు. BJP ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్మృతివనానికి N4, E4 రోడ్డు జంక్షన్‌లో 2.33ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.