News November 30, 2025
భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులతో చెలరేగారు. ఏకంగా 7 సిక్సర్లు, 11 ఫోర్లు బాదారు. రోహిత్ (57), కేఎల్ రాహుల్ (60) రాణించగా.. జైస్వాల్ 18, గైక్వాడ్ 8, సుందర్ 13, జడేజా 32 రన్స్ చేశారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Similar News
News March 26, 2026
మార్కాపురం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

AP: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2లక్షలు.. గాయపడ్డ వారికి ₹50వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు సహకారం అందించాలని సీఎస్ను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సంతాపం తెలిపిన జగన్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 26, 2026
దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

TG: 2024, 2025 దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు 44 కంపెనీలతో MOU చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సంస్థల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉందని అసెంబ్లీలో తెలిపారు. వీటివల్ల 68,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని చెప్పారు. ‘రూ.81,800 కోట్ల పెట్టుబడికి సంబంధించి 6 కంపెనీలకు భూములు కేటాయించాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం సమకూరింది’ అని వివరించారు.
News March 26, 2026
‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా తీస్తున్నా: వివేక్ అగ్నిహోత్రి

పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ కథాంశంతో సినిమాను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ఈ చిత్రాన్ని T-సిరీస్ నిర్మిస్తుందని తెలిపారు. ‘ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరమైన కథలను చెప్పడానికి నేను సిద్ధం. ధైర్యం, స్పష్టత, ప్రొఫెషనలిజమ్తో సినిమాలు తీయడానికి ప్రాధాన్యం ఇస్తా. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కల్పించడానికే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు.


