News May 7, 2025
భారత్ సమ్మిట్లో పెద్దపల్లి ఎంపీ

హైదరాబాద్లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అతిథిగా హాజరయ్యారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణలో ఇలాంటి గ్లోబల్ కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని కాంక్షించారు. రాష్ట్ర యువతకు ఇదొక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
Similar News
News April 13, 2026
హనుమకొండలో మెరుగైన ఇంటర్ ఫలితాలు

హనుమకొండ జిల్లాలో 2026 ఇంటర్మీడియట్ ఫలితాలు ఆశాజనకంగా నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సర జనరల్ విభాగంలో 78.57%, ఓకేషనల్లో 73.78% ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగం 69.16% ఫలితాలతో ముందంజలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెల్లడించారు.
News April 13, 2026
IPL: లక్నోపై గుజరాత్ ఘనవిజయం

లక్నో వేదికగా LSGతో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 165 పరుగుల టార్గెట్ను 18.4 ఓవర్లలో ఛేదించింది. బట్లర్(60), గిల్ (56) రాణించారు. ఈ సీజన్లో GTకి ఇది రెండో విజయం కాగా లక్నోకు రెండో ఓటమి.
News April 13, 2026
BREAKING: టాస్ గెలిచిన ముంబై

వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు.


