News August 31, 2024
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, కావున అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News September 14, 2024
KMM: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఈనెల 16 సోమవారం నాడు ఖమ్మం నగరంలో వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అటు నగరంలో శోభాయాత్ర జరిగే మార్గాలు, వాహనదారుల ప్రత్యామ్నాయ మార్గాల మ్యాపును సీపీ విడుదల చేశారు.
News September 14, 2024
చర్ల: సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు
చర్ల సరిహద్దులోని అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పూర్వాతి గ్రామంలో పోలీసుల బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడులు చేశారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీన్ని భద్రతా బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
News September 14, 2024
కొత్తగూడెం: రూ.మూడు లక్షలతో గణేషుడికి అలంకరణ
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నపురెడ్డిపల్లిలోని గణేశ్ విగ్రహానికి భక్తుల నుంచి సేకరించిన మూడు లక్షల రూపాయలతో అలంకరణలు చేశారు. లక్ష్మీ గణపతి అవతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లక్ష్మీ గణపతి విశిష్టతను పూజారి భక్తులకు తెలిపారు. ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు.