News August 28, 2025
భారీ వర్షాలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. లోతట్టు ప్రాంతాలకు, నీరు ప్రవహిత ప్రాంతాలకు, వాగులు, చెక్ డ్యాముల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. చెట్ల క్రింద నిల్చోరాదని, కరెంటు వైర్స్ వద్ద నిలబడవద్దని, పాత ఇల్లు, షెడ్లు వంటి వాటిలో నివసించవద్దని అత్యవసర పరిస్థితుల్లో 100ను సంప్రదించాలని కోరారు.
Similar News
News August 28, 2025
సెప్టెంబర్ 7న తాత్కాలికంగా తిరుమల ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
News August 28, 2025
NZB: 7 పునరావాస కేంద్రాలు.. 164 కుటుంబాలు

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్పల్లి, NZB రూరల్, జక్రాన్పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.
News August 28, 2025
NZB: 12,413 ఎకరాల్లో పంట నష్టం: కలెక్టర్

జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. పై ప్రాంతాల్లో మూడు చెరువులు తెగిపోగా, సుమారు 12,413 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు చెప్పారు. నీట మునగడం వల్ల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.