News March 31, 2025

భార్య పుట్టింటికి వెళ్లడంతో.. భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపనతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరు మండలం శేషగిరి నగర్‌కు చెందిన గుంజ చిన్న రామారావు(28) తన భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 16, 2025

ఉప్పల్ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొట్టిన లారీ

image

ఉప్పల్ NGRI సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొని సెప్టిక్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ కుమార్ నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ట్యాంకర్‌ను తొలగించి రోడ్డు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

News September 16, 2025

NGKL: ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

సెప్టెంబర్ 17న నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు ఎస్పీ కార్యాలయం, 9:50 గంటలకు కలెక్టర్ కార్యాలయంపై జాతీయ జెండా ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరవుతారని తెలిపారు.

News September 16, 2025

సంగారెడ్డి: ‘ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి’

image

జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఈనెల 17వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ పద్మజారాణి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.