News November 19, 2025
భార్య మృతి కేసులో టీచర్ సస్పెన్షన్: అనకాపల్లి డీఈవో

భార్య మృతి కేసులో బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారం ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరావును డీఈవో అప్పారావునాయుడు మంగళవారం సస్పెండ్ చేశారు. ఉమామహేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యుల వేధింపులు కారణంగా భార్య వీణ చోడవరంలో నివాసం ఉంటున్న ఇంటిలో ఈనెల 12న కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై పోలీసులు ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు.
Similar News
News April 14, 2026
NZB: వేసవి ఉపశమనం.. ఉపాధికి ఊతం

ఎండలు మండిపోతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత తీవ్రమైంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎయిర్ కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్లో కొత్త కూలర్ల విక్రయాలు జోరందుకున్నాయి. పాత కూలర్లను బాగు చేయించేందుకు జనం దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈ సీజన్ కారణంగా అటు విక్రయదారులు, ఇటు మరమ్మతుల ద్వారా మెకానిక్లకు చేతినిండా పని దొరుకుతూ ఉపాధి పొందుతున్నారు.
News April 14, 2026
భీమవరం కలెక్టరేట్లో అంబేడ్కర్ జయంతి

భీమవరం కలెక్టరేట్లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 14, 2026
850కి పెరగనున్న లోక్సభ స్థానాలు!

లోక్సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.


