News April 24, 2025
భీమడోలు: తారాబు జలపాతం వద్ద యువకుడి గల్లంతు

పెదబయలు మండలంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తారాబు జలపాతంలో ఓ యువకుడు గల్లంతైనట్టు స్థానిక ఎస్ఐ రమణ తెలిపారు. పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చారన్నారు. వీరిలో ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.
Similar News
News April 25, 2025
సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. తక్షణమే జల ఒప్పందం రద్దు అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్కు లేఖ రాశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహించడమే కారణమని పేర్కొన్నారు. అగ్రిమెంట్లో భాగంగా సంప్రదింపులకు విజ్ఞప్తిని పలుమార్లు పాక్ తిరస్కరించిందని గుర్తు చేశారు.
News April 25, 2025
వరంగల్ జిల్లాలో ఈరోజు HEAD LINES

✓వరంగల్ కమిషనరేట్లో విస్తృతంగా తనిఖీలు
✓WGL: క్వింటా పత్తి ధర రూ.7,700
✓సంగెం మండలంలో పర్యటించిన పరకాల MLA రేవూరి
✓భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న MLC కవిత
✓నల్లబెల్లి: గొర్రెలు, మేకలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
✓11వ రోజుకు చేరిన తూర్పు జర్నలిస్టుల దీక్ష
✓WRPT: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన MLA నాగరాజు
✓ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని పలుచోట్ల ర్యాలీలు
News April 25, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞టెన్త్ టాపర్ ఆదిల్కు DEO అభినందన☞శోభనాగిరెడ్డి వర్ధంతి వేడుకల్లో భావోద్వేగానికి గురైన భూమా మౌనిక☞మిస్ యూ అమ్మా.. MLA భూమా అఖిలప్రియ ఎమోషనల్.!☞రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు: జేసీ☞పహాల్గమ్ ఉగ్రదాడిని నిరసిస్తూ నంద్యాలలో ర్యాలీ☞ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: మన్నే☞బ్రేకులు ఫెయిల్.. శ్రీశైలం ఘాట్లో ప్రమాదం.