News February 2, 2025

భీమడోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలోని రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలతో ఆదివారం మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 మధ్య ఉంటుందని, ఎత్తు 5.6, నలుపు జుట్టు, సామాన్య దేహదారుఢ్యం కలిగి ఉందని ఏలూరు రైల్వే SI పి. సైమన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు సెల్ నంబర్ 9989219559 కు సంప్రదించాలని కోరారు.

Similar News

News November 13, 2025

ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

image

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్‌ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్‌ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.

News November 13, 2025

వరంగల్ కమిషనర్ పరిధిలో 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 110 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 57 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనాన్ని సైతం సీజ్ చేయడం జరుగుతుందని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

News November 13, 2025

సిరిసిల్ల జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా, అందులో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు, సీసీఐ ఆధ్వర్యంలో మరో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.