News March 7, 2025
భీమదేవరపల్లి: న్యాయం కోసం CM వద్దకు పాదయాత్ర

భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఆషాడపు దశరథం కొడుకు రాజేష్ 2018లో ఓ పెళ్లి బారాత్లో డాన్స్ చేస్తూ మృతిచెందాడు. విష ప్రయోగంతో చనిపోయాడని, నిందితులను శిక్షించి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా దశరథం దంపతులు వంగర పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్నారు. గురువారం ‘న్యాయం కోసం ముఖ్యమంత్రి’ వద్దకు బ్యానరుతో బయలు దేరారు. రాంనగర్ వద్దకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు.
Similar News
News March 7, 2025
సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.
News March 7, 2025
చందోలు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట గురువారం చందోలు పోలీసులను ఆశ్రయించింది. పిట్టలవానిపాలెం మండలం పరిసవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2025
VZM: జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఎస్.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.