News July 18, 2024
భీమదేవరపల్లి: సింగరేణి ఓపెన్ కాస్ట్లో ప్రమాదం.. కార్మికుడు మృతి
పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-2లో బుధవారం జరిగిన ప్రమాదంలో భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన ఉద్యోగి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబం కొన్నేళ్ల కిందటే గోదావరిఖనిలో స్థిరపడింది. సింగరేణి విధులకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారనే విషయం తెలుసుకొని ఆయన మిత్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News October 7, 2024
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తాం: జగిత్యాల ఎస్పీ
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
News October 7, 2024
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
హుస్నాబాద్: EWS రిజర్వేషన్ల వల్ల SC, ST, BC విద్యార్థులకు DSCలో తీవ్ర అన్యాయం జరిగిందని BC సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు పిడిశెట్టి రాజు అన్నారు. సమాజంలో 6 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
News October 7, 2024
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ లైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు.