News October 6, 2025
భీమవరంలో నేడు యథావిధిగా పీజిఆర్ఎస్

భీమవరం కలెక్టరేట్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. 1100 నంబర్కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 5, 2025
పేరుపాలెం బీచ్లో 38 ఏళ్ల యువకుడు గల్లంతు

మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో శివారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం విజయవాడకు చెందిన మాడెపల్లి ప్రవీణ్ (38) గల్లంతయ్యాడు. తన స్నేహితులతో కలిసి బీచ్కు వచ్చి సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
News October 5, 2025
ఈనెల 7న ఉమ్మడి జిల్లాల స్కూల్ గేమ్స్ ఎంపికలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 14 అండర్ 17 బాల బాలికల స్కూల్ గేమ్స్ ఎంపికలను ఈనెల 7న నిర్వహిస్తున్నామని స్కూల్ గేమ్స్ కార్యదర్శులు డి.సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు శనివారం తెలిపారు. టేబుల్ టెన్నిస్, మాల్కంబ్, లాన్ టెన్నిస్ ఎంపికలను వీరవాసరం ఎంఆర్కె జడ్పీ హైస్కూల్, చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హైస్కూల్, బీమవరం టౌన్ హల్, పాలకొల్లులో జరుగుతాయన్నారు.
News October 5, 2025
తణుకు: హత్య కేసులో ప్రధాన నిందితులు వీరే

తణుకులో సంచలనం రేకెత్తించిన యువకుడి హత్య కేసులో నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు, వల్లూరి పండు బాబు, సరెళ్ల సాయి కృష్ణ, బంటు ఉదయ్ కిరణ్, గంటా ఫణీంద్ర బాబు, న్యాయవాది భార్య తిర్రే శిరీషలను రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మృతదేహాన్ని తరలించడానికి వినియోగించిన కారు యజమాని, న్యాయవాది సోదరుడు తిర్రే విజయకృష్ణ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ విశ్వనాథ్ వెల్లడించారు.