News September 3, 2025

భీమవరం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

రైతులను మోసం చేసేందుకు కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పౌరసరఫరాల, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అధిక ధరలకు అమ్మే దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

Similar News

News September 3, 2025

భీమవరం: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో వర్క్ ఫ్రం హోం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాహనాల ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, వర్క్ ఫ్రం హోం, ఈ-కేవైసీ వంటి అంశాలపై ఆమె చర్చించారు. ‘తల్లికి వందనం’ పథకంలో నగదు జమలో ఉన్న అడ్డంకులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

News September 3, 2025

డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ నాగరాణి

image

ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద డబ్బులు వసూలు చేసినట్లు రుజువైతే పెనాల్టీతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు ఆసుపత్రులపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత కమిటీతో కలిసి ఆమె విచారణ చేపట్టారు. భీమవరం ఒమేగా, రాజర్షి, శ్రీలక్ష్మి, మదర్‌వాణి, తణుకు ఆపిల్ ఆసుపత్రులతో సహా మొత్తం 16 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు వచ్చినట్లు ఆమె తెలిపారు.

News September 3, 2025

ఉల్లి రైతులను ఆదుకోవాలి: జేసీ

image

జిల్లాలోని వివిధ విద్యాసంస్థలు, వసతి గృహాల వంటకాలలో కర్నూలు ఉల్లి వినియోగించి కష్టకాలంలో ఉన్న ఉల్లి రైతులను ఆదుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. భీమవరం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం కర్నూలు ఉల్లి వినియోగంపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. కర్నూలు, నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాలు కారణంగా దెబ్బతిన్నాయని అన్నారు.