News August 19, 2025
భీమవరం: కల్లు గీత కార్మికులకు బార్ల ఎంపిక

జిల్లాలోని కల్లుగీత కార్మికులకు కొత్తగా మంజూరైన 3 బార్లకు కులాల వారి రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో కల్లు గీత కార్మికులకు కేటాయించిన బార్ల ఎంపిక రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ తీసి ఎంపిక చేశారు. శెట్టి బలిజలకు -2, గౌడ – 1ను భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో కేటాయించడం జరిగిందన్నారు.
Similar News
News August 19, 2025
నరసాపురం: సైలింగ్ బోటింగ్కు వంద మంది క్యాడెట్లు

వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి 10వ వరకు ఒరిస్సాలోని చిలుక నేవల్ బేస్లో నరసాపురం ఆంధ్రా యూనిట్ ఆధ్వర్యంలో సైలింగ్ బోటింగ్ సాహస యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది క్యాడెట్లు పాల్గొనన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను యూనిట్ కమాండర్ సంజిత్ రౌత్రే, డిప్యూటీ క్యాంపు కమాండర్ అనిల్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.
News August 18, 2025
దుంపగడప: వీవీ గిరి కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన

ఆకివీడుమండలం దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ, కలెక్టర్ నాగరాణీలు శంకుస్థాపన చేసారు. భారత జీవిత భీమా సంస్థ సామాజిక బాధ్యత విభాగం గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వీవీ.గిరి ప్రభుత్వ కళాశాలకు ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మాణానికి రూ. 1.06 కోట్లు నిధులు ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
News August 18, 2025
భీమవరం: ‘అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై సమీక్ష’

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పనతో బలోపేతానికి ఐసీడీఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 489 అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడికి రూ.16 వేలు చొప్పున కేటాయించిన నిధులతో గుర్తించిన పనులను పూర్తి చేయాలన్నారు.