News November 23, 2024

భీమవరం: కేంద్ర మంత్రికి జిల్లా ప్రముఖులు పరామర్శలు

image

పితృవియోగం పొందిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను పలువురు నేతలు శనివారం పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరమిల్లి రాధాకృష్ణ, ధర్మరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 22, 2026

భీమవరం: రేపు 10గం.ల నుంచి 1 గంట వరకే ఈ కార్యక్రమం

image

భీమవరం కలెక్టరేట్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30ని.ల వరకు అర్జీలను స్వీకరిస్తామన్నారు.

News February 22, 2026

ప.గో: EX MLA పేరుతో INSTA అకౌంట్.. నమ్మితే అంతే..!

image

నరసాపురం మాజీ MLA కొత్తపల్లి జానకీ రామ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఖాతాల ద్వారా అభిమానులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, అనుచరులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపి మోసపోవద్దని జానకీ రామ్ కోరారు.

News February 22, 2026

భీమవరం: అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

image

కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీగా ఉండి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం ప.గో.జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.