News October 21, 2025
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జై సూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీ అదాన్ నయీమ్ అస్మితో మంగళవారం మాట్లాడిన పవన్, వెంటనే డీఎస్పీపై విచారణకు ఆదేశించి, నివేదికను హోం శాఖకు, డీజీపీకి పంపించాలని ఆదేశించారు.
Similar News
News October 22, 2025
ఈనెల 27న TPG లో కొనుగోలు కేంద్రం ప్రారంభం: జేసీ

ఈనెల 27న తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు జేసీ రాహుల్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.
News October 21, 2025
పేరుపాలెం బీచ్ సందర్శకులకు అనుమతి లేదు: ఎస్ఐ

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున బుధవారం పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News October 21, 2025
తణుకు: ఇరు వర్గాల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు

తణుకు మండలం తేతలిలో సోమవారం రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. వివాదం తీవ్రమై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఎస్ఐ కె. చంద్రశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.