News December 25, 2025
భీమవరం డీఎస్పీ బదిలీ

AP: భీమవరం డీఎస్పీ <<18073175>>జయసూర్యను<<>> డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని అక్టోబర్లో డిప్యూటీ సీఎం పవన్ డీజీపీకి లేఖ రాశారు. ఆయన పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే జయసూర్య మంచి అధికారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ అప్పట్లో కితాబిచ్చారు.
Similar News
News December 26, 2025
సంక్రాంతికి రైతుభరోసా..!

TG: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News December 26, 2025
మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలి?

మామిడి చెట్లలో అక్కడక్కడ పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్, JAN నెలల్లో రైతులు తీసుకునే చర్యలు మామిడి పూతను నిర్ణయిస్తాయి. ఈ సమయంలో పంటకు తేనెమంచు పురుగు, బూడిద తెగులు ముప్పు ఎక్కువ. వాటి నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటూనే చెట్లలో సూక్ష్మపోషకాల లోపాన్ని గుర్తించి అవసరమైన మందులను నిపుణుల సూచనలతో పిచికారీ చేయాలి. మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 26, 2025
వరుసగా రెండో ఏడాది.. భారత క్రికెటర్లకు నిరాశ!

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్రత్న’ జాబితాలో రెండేళ్లుగా క్రికెటర్లకు చోటు దక్కట్లేదు. తాజాగా గగన్ నారంగ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 24 మంది క్రీడాకారుల పేర్లను క్రీడా మంత్రిత్వశాఖకు పంపగా అందులో ఏ ఒక్క క్రికెటర్ లేరు. ఈ ఏడాది మెన్స్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ASIA కప్ గెలవగా.. ఉమెన్స్ టీమ్ తొలిసారి వన్డే WC సాధించింది. అయినా ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


