News December 22, 2025
భీమవరం: నేడు PGRS కార్యక్రమం

భీమవరం కలెక్టరేట్తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేనివారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News December 24, 2025
ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News December 24, 2025
ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News December 23, 2025
ఏలూరు జిల్లాలో 92.93 శాతం మందికి పోలియో చుక్కలు

ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి గీతాబాయి తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు బూత్లలోనూ, ఇంటింటికీ తిరిగి చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1,87,204 మంది చిన్నారులకు గాను, 1,73,975 (92.93%) మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆమె వెల్లడించారు.


