News April 13, 2025

భీమవరం : మహిళపై ఇద్దరి అసభ్య ప్రవర్తన

image

ఇళ్లలో పని చేసుకుని బతుకుతున్న ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన భీమవరంలో జరిగింది. రాయలం గ్రామానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేసుకుని జీవిస్తోంది. గురువారం ఆమె పని నుంచి ఇంటికి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన కుమార్, అతని ఫ్రెండ్ ఆమెను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ మేరకు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూ టౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు.

Similar News

News April 13, 2025

భీమవరంలో చికెన్ రేట్లు ఇలా.!

image

భీమవరం, పాలకోడేరు, వీరవాసరం మండలాలు చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ ధర రూ.800 నుంచి రూ .1000 మధ్యలో ఉంది. అలాగే చికెన్ కేజీ రూ. 240 – రూ.260 మధ్యలో ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News April 13, 2025

ప.గో: రెండు నెలలు చేపల వేట బంద్

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు నెలల పాటు చేపల వేట నిషేంధించినట్లు ప.గో జిల్లా మత్స్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదన్నారు. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. ప.గో జిల్లాకు 10వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 14,260 మంది పరీక్షలు రాయగా 11,948 మంది పాసయ్యారు. 84 శాతం పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 10వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 17,257 మందికి 12,046 మంది పాసయ్యారు. 70 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!