News August 28, 2025
భీమవరం: రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన జేసీ

అనాకోడేరు, ఎల్.జి పాడు గ్రామాల్లో జరుగుతున్న ఫేజ్-3 ప్రభుత్వ భూముల రీ సర్వే ప్రక్రియను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డుల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వీఆర్వోలు వెంటనే పూర్తి చేయాలని జేసీ సూచించారు. జిరాయితీ భూముల సర్వేను కూడా వేగవంతం చేయాలన్నారు.
Similar News
News September 5, 2025
పాలకొల్లు: మహిళ కడుపులో భారీ గడ్డ

పోడూరులోని వద్దిపర్రుకు చెందిన కడియం సీతా మహాలక్ష్మి కడుపు నొప్పి, ఉబ్బరంతో గురువారం రాత్రి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికివచ్చారు. వైద్యులు స్కాన్ చేసి కడుపులో గడ్డ ఉందని తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణతిని బైటకు తీసి ఆమెను కాపాడారు. జనరల్, లాప్రోస్కోపిక్ సర్జన్ డా.లంకలపల్లి గోకుల్ కుమార్, డా. లక్ష్మి వైద్యులను అభినందించారు.
News September 4, 2025
వాహనాలను గూడ్స్ క్యారేజ్ గా మార్చుకోవాలి: కృష్ణారావు

మొబైల్ క్యాంటీన్గా రిజిస్టర్ అయిన వాహనాలను తక్షణమే గూడ్స్ క్యారేజ్గా మార్చుకోవాలని జిల్లా రవాణా అధికారి కృష్ణారావు గురువారం తెలిపారు. జిల్లాలో 334 మొబైల్ క్యాంటీన్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, వాటి యజమానులు సోమవారంలోగా తమ వాహన పత్రాలతో రవాణా శాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. మొబైల్ క్యాంటీన్ నుంచి గూడ్స్ క్యారేజ్గా మార్చుకోవాలని కోరారు.
News September 4, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

జిల్లాలో ఎరువుల కొరత లేదని, సొసైటీలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం వీరవాసరంలోని శ్రీనివాస ట్రేడర్స్, సాయి లక్ష్మి ఫెర్టిలైజర్స్, వ్యవసాయ సహకార సంఘం గోదాములను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా నిల్వలపై స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువుల అమ్మకాలలో ప్రభుత్వ నియమాలను పాటించనిపై వారిపై చర్యలు తప్పవన్నారు.