News January 19, 2026

భీమవరం వన్‌టౌన్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. ఈ మార్పును గమనించి, అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.

Similar News

News February 4, 2026

రబీ సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రబీ పంటకు సాగునీటి సరఫరాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. సాగునీటి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

News February 4, 2026

రబీ సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రబీ పంటకు సాగునీటి సరఫరాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. సాగునీటి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

News February 3, 2026

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ వైద్యులు భరోసా కల్పించాలి: కలెక్టర్

image

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ వైద్యులు భరోసా కల్పించేలా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆకివీడు మండలం పెదకాపవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో రిజిస్టర్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రిజిస్టర్ అవుతున్న కేసుల వివరాలు పరిశీలించారు.