News September 13, 2025

భీమారం: మహిళా సంఘాలకు ప్రోత్సాహం: మంత్రి వివేక్

image

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. భీమారం మండల కేంద్రంలో 134 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన నూతన ముదిరాజ్ మహిళా సంఘానికి చెందిన మహిళలకు ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

GDK: లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం: జడ్జి

image

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందుతారని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ లలో రాజీ కుదుర్చుకుంటే ఒకరు గెలిచి, మరొకరు ఓడినట్లు కాదన్నారు. రాజీ పడిన వివిధ కేసులను ఆయన కొట్టివేశారు.

News September 14, 2025

కరీంనగర్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

image

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు మోసాలు, ఏపీకే ఫైల్స్, సిమ్ కార్డుల దుర్వినియోగం, బ్యాంక్ ఖాతా సమాచారం, లింక్స్, పెట్టుబడుల మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ వంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

News September 14, 2025

బాలయ్య తరఫున సీఎంకు రూ.50 లక్షల చెక్కు అందజేత

image

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్‌కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్తులోనూ తన వంతుగా ఇలాంటి సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.