News May 22, 2024

భీమిలి: రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి

image

భీమిలి నియోజకవర్గం తగరపువలస-ఆనందపురం సర్వీసు రోడ్డులో వలందపేట దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లవలస రాజేశ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రిటైర్డ్ కానిస్టేబుల్ దండు వెంకటపతిరాజు(64) పూజ సామగ్రి కోసం సంగివలసకు బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఆయన మృతిచెందారు. రాజు కుమారుడు లండన్‌లో చదువుతుండగా సంగివలసలో కుమార్తె సాయిలక్ష్మి దగ్గర ఆయన ఉంటున్నారు.

Similar News

News February 11, 2026

జీవీఎంసీలో డీసీపీలకు జోన్‌ల కేటాయింపు

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ డీసీపీలకు జోన్లు వారిగా విధులు కేటాయిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.
➣టి.జి.రామ్మోహన్‌కు పెందుర్తి, వెస్ట్ జోన్
➣కె.హరిదాస్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్
➣సిహెచ్.మధుసూదన్ రావు గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్
➣కే.వెంకటేశ్వరరావుకు భీమిలి, మధురవాడ జోన్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 11, 2026

జీవీఎంసీలో డీసీపీలకు జోన్‌ల కేటాయింపు

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ డీసీపీలకు జోన్లు వారిగా విధులు కేటాయిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.
➣టి.జి.రామ్మోహన్‌కు పెందుర్తి, వెస్ట్ జోన్
➣కె.హరిదాస్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్
➣సిహెచ్.మధుసూదన్ రావు గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్
➣కే.వెంకటేశ్వరరావుకు భీమిలి, మధురవాడ జోన్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 10, 2026

విదేశాల్లో ఉద్యోగం అంటూ మోసం.. వ్యక్తి అరెస్ట్: విశాఖ సీపీ

image

విదేశాల్లో భారీ జీతంతో ఉద్యోగం అంటూ చైనా స్కామ్ కంపెనీలకు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఒక వ్యక్తికి టెలిగ్రామ్ ద్వారా మయాన్మార్‌లో జాబ్ అని సైబర్ స్కాం కంపనీలో పనిచేయిస్తున్నారు. విశాఖ నుంచి యువకులు వెళ్లి మోసపోయి తిరిగి ఇండియన్ ఎంబసీ ద్వారా విశాఖ వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ చేసి కృష్ణ జిల్లాకు చెందిన పిల్లి అవినాష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.