News October 14, 2025
భీమ్గల్: పాఠశాల బస్సు కిందపడి బాలుడి మృతి

భీమ్గల్ మండలం రహత్నగర్లో మంగళవారం కృష్ణవేణి స్కూల్ బస్సు కిందపడి శ్రీకాంత్(3) అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ఉదయం పాఠశాలకు అతని అన్నను బస్సులో ఎక్కించడానికి కుటుంబీకులతో వెళ్లిన సమయంలో బస్సు చక్రాల కింద పడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు కోమాలోకి వెళ్లడంతో వైద్యం కోసం NZB తీసుకెళ్లగా మృతి చెందాడు.
Similar News
News October 14, 2025
అందరి ఆమోదంతో డీసీసీ ఎన్నిక: సూరజ్ సింగ్ ఠాగూర్

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పరిగిలోని వాసవి బంక్యూట్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ జిల్లాస్థాయి సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో AICC ఇన్ఛార్జ్ సూరజ్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ పకడ్బందీగా చేపడతామని తెలిపారు.
News October 14, 2025
పీఎం కిసాన్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించండి: జేసీ

వీఆర్ఓ, ఎమ్మార్వో లాగిన్లలో పెండింగ్లో ఉన్న పీఎం కిసాన్ దరఖాస్తుల్లోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు గ్రామ సచివాలయాల ద్వారా, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేయించాలని అధికారులకు సూచించారు.
News October 14, 2025
బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?