News April 17, 2025
భువనగిరిలో భారీగా గంజాయి పట్టివేత

భువనగిరిలో బుధవారం దాదాపు 51.13 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 24 ప్యాకెట్ల గంజాయి మొత్తం విలువ రూ. 14.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు మహమ్మద్ ఆమిర్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇస్మాయిల్ పట్టుబడ్డారు. మరో నిందితుడు బాషా పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News April 19, 2025
కంది: జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలి: డీఈఓ

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు.
News April 19, 2025
ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.
News April 19, 2025
NKP: భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం, కొత్త కొత్తూరు గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.