News August 13, 2025
భువనగిరి: అపోహలు పటాపంచలు.. ఎనిమిది మందికి పునర్జన్మ

అవయవదానం చేయడానికి సాధారణంగా ఎవరూ ముందురు రారు. మూఢనమ్మకాలతో వెనకడుగు వేస్తుంటారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయట్లేదు. పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకొస్తున్నారు. భువనగిరికి చెందిన మెతుకు సతీశ్ 2021లో రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మరణించారు. కుటుంబ సభ్యులు సతీష్ అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చారు. నేడు ప్రపంచ అవయవ దినోత్సవం.
Similar News
News August 14, 2025
హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో బాపట్ల కలెక్టర్..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి వి.అనిత బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ వెంకట మురళీ హాజరయ్యారు. జిల్లాలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, కొల్లూరు మండలంలో SDRF సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
News August 14, 2025
వీధి కుక్కలు లేకపోతే ఎలుకలు పెరుగుతాయా?

ఢిల్లీలో వీధి <<17384668>>కుక్కలన్నింటినీ<<>> షెల్టర్లకు తరలించాలని SC ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఫ్లాష్బ్యాక్కి వెళితే 1880ల్లో రేబిస్ కారణంగా పారిస్ పెద్ద సంఖ్యలో కుక్కలను చంపేసింది. తర్వాత అక్కడ ఎలుకల సంఖ్య బాగా పెరిగింది. సాధారణంగా ఎలుకల నియంత్రణలో వీధి కుక్కలది కీలకపాత్ర. నిజానికి ఎలుకలూ తీవ్ర నష్టం చేయగలవు. అటు వీధులన్నీ తిరిగే కుక్కలు అనేక రోగాల వ్యాప్తికి కారణమనే బలమైన వాదన ఉంది. దీనిపై మీ కామెంట్?
News August 14, 2025
భూధార్ నంబర్ల కేటాయింపుపై అధికారులకు CM ఆదేశాలు

TG: భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వారసత్వ, ఇతర మ్యుటేషన్ల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సమీక్ష సమావేశంలో సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.