News November 28, 2025
భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయిన ఘటన భువనగిరి మండల పరిధిలో జరిగింది. కుమ్మరిగూడెంకు చెందిన లక్ష్మయ్య అనే రైతు పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
NGKL: పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం పూజలు

జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ పట్టణంలోని పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట ప్రత్యేకంగా అర్చన చేసి ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు జూపల్లి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News December 1, 2025
NGKL: సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటన, ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News December 1, 2025
NGKL: పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి ఎన్నికల పోరులో నాయకులు

NGKL జిల్లాలో జరుగుతున్న GP ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి పని చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో బిజెపి, BRS పార్టీల నాయకులు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి పోటీ చేస్తున్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారనే విమర్శలు ఉన్నాయి.


