News October 15, 2024

భువనగిరి: ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

మహారాష్ట్ర ,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ముంబైలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్ చేన్నితల, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వంశీ చందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 24, 2025

నకిలీ వైద్యులకు కేరాఫ్ నల్గొండ

image

జిల్లాలో నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నల్గొండతోపాటు DVK, MLG, అనుముల, NKL, చిట్యాల, చండూరు తదితర ప్రాంతాల్లో నకిలీ వైద్యులు శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో జిల్లాలో నకిలీ వైద్యుల బాగోతం బయటపడింది. నకిలీ వైద్యులపై జిల్లా వైద్య శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

News December 24, 2025

నల్గొండ జిల్లాలో వణికిస్తున్న చలి

image

జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు చలి గాలులు కూడా వీస్తుండడంతో పల్లె ప్రజలతో పాటు పట్టణ వాసులు ఉదయం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.

News December 24, 2025

NLG: కేటీఆర్ రాక.. బీఆర్ఎస్‌లో నయా జోష్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో గులాబీ నేతల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా గెలిచిన 230 మంది సర్పంచులను సన్మానించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం కార్యకర్తల్లో జోష్ నింపింది. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి.. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ చేసిన ప్రసంగంతో నూతన సర్పంచులు, ఆ పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు.