News March 17, 2025

భువనగిరి కోటపైన రోప్ వే

image

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.

Similar News

News March 17, 2025

భారీగా కార్ల ధరలు పెంచుతున్న మారుతీ సుజుకీ

image

కస్టమర్లకు మారుతీ సుజుకీ షాకిచ్చింది. 2025, APRIL నుంచి కార్ల ధరలను 4% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముడి వనరుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. మోడల్‌ను బట్టి కస్టమర్లపై తక్కువ భారం వేసేందుకే ప్రయత్నించామని వెల్లడించింది. 2025లో ఈ కంపెనీ ధరలు పెంచడం ఇది మూడోసారి. గత DEC ప్రకటించిన 4% పెంపు JANలో అమల్లోకి వచ్చింది. FEBలో మోడల్‌ను బట్టి రూ.1500-32,500 వరకు పెంచింది.

News March 17, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

image

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.

News March 17, 2025

అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు: మంత్రి

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. దేవాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆయన తనకు ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా అందజేశారని సభలో వెల్లడించారు.

error: Content is protected !!